Kanchi Paramacharya Patham (Adugu Jadalu)
This book was published in the year 2016 and was released on the 23rd Aaradhana of Mahaswami.
మానవాళికి ధర్మపధ నిర్దేశనం చేసి వేలాదిమందికి ఓదార్పు, ఉపశమనం, మార్గదర్శనం చేసిన దివ్యజ్యోతి శ్రీపరమాచార్య.
ఈనాడు జీవితాన్ని గురించి, మానవీయ విలువల, నైతిక ధార్మిక ప్రవర్తన గురించి చెప్పే చదువులు లేవుగాకలేవు! దానివల్ల ఎన్నో వత్తిడులు, బలహీనతలు, మానసిక అలజడులకు లోనవుతున్న నేటి సమాజానికి మహాస్వామి జీవితపథం, బోధనలు అనుసరణీయం.
భారతీయ సంస్కృతి, కబోదికి కనుచూపు, కాలినడకన కాశీకి, రామేశ్వరానికి బియ్యం, దలైలామా, వంటి వ్యాసాలు, ప్రఖ్యాత పాత్రికేయుడు ఏ.ఎస్. రామన్ చేసిన ఇంటర్వ్యూలో - మతపరంగా హిందువులకు జరుగుతున్న అన్యాయం, సంస్కృతం జాతీయ భాష, దోషాలన్నిటికి విరుగుడు వర్ణ వ్యవస్థ లాంటి విషయాలపై చర్చ, స్వామివారి స్మృతి చిహ్నంగా కంచి సమీపంలోని ’ఒరుక్కాయ్’ గ్రామంలో నిర్మించిన మణిమండపం గురించి ఒక సమగ్ర కథనం లాంటి విశేషాలన్నీ పొందుపరచిన గ్రంథం పరమాచార్య పథం.
Tags: kanchi paramacharya patham, adugu jadalu, paramacharya, challapalli venkata ratna prasad, challapalli